Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శ్రీను వైట్ల-మహేష్ బాబు మళ్లీ... వారి నష్టాలను పూడ్చడానికేనా?
హైదరాబాద్: మహేష్ బాబు కెరీర్లో హిట్ సినిమా ‘దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈచిత్రం అప్పట్లో మహేష్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆగడు' చిత్రం భారీ ప్లాప్. ఈ రెండు చిత్రాలను నిర్మించింది 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారే.
త్వరలో మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆగడు సినిమా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థకు భారీ నష్టాలను తెచ్చిన నేపథ్యంలో సంస్థను నష్టాల నుండి బయట పడేసేందుకే ఇద్దరూ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు మహేష్ బాబు, శ్రీను వైట్ల ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. గతంలో మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ సంస్థ నిర్మించిన ‘1-నేనొక్కడినే' కూడా నష్టాలను తెచ్చింది. ఈ నేపథ్యంలో తనను నమ్ముకుని సినిమాలు తీసిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థను నష్టాల నుండి గట్టెక్కించాలని మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2016 నాటికి ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీను వైట్ల వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత 2016లో 14 రీల్స్ సంస్థ కోసం చేయబోయే సినిమాపై దృష్టి సారించనున్నారు.