Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫైనల్ గా....
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రానికి కలేజా అని ప్రచారంలో ఉంది. అయితే 'సారధి' అనే టైటిల్ ఓకే కావచ్చునని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ ..క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలను గత నాలుగు రోజులుగా పూనే దగ్గరలోని ఓ పది కిలోమీటర్లు దూరంలోని విలేజ్ లో చేస్తున్నారు. 'సారధి' టైటిల్ పై మహేష్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మరో టైటిల్స్ చెప్పినా దీనినే ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావటంతో ఆ డేట్ నిర్ణయించారని చెప్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్లతో చేసే చిత్రం జూన్ నెలాఖరున ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సురేంద్ర రెడ్డితో మిస్టర్ ఫెరఫెక్ట్, లింగుస్వామితో చేసే చిత్రం ఉంటుంది.