Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
మహేష్, మోహన్ లాల్, ఆర్య కాంబినేషన్ లో...
హైదరాబాద్ : టాలీవుడ్ లో ఇప్పుడు మల్టి స్టారర్ చిత్రాలుఓ ట్రెండ్ గా మారాయి. దాన్ని తమిళమూ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా...మహేష్, ఆర్య,మోహన్ లాల్ కాంబినేషన్ లో ఓ తమిళ,తెలుగు,మళయాళ భాషల్లో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తమిళంలో హిట్టైన జిల్లా చిత్రం దర్శకుడు నేశన్ ప్లాన్ చేస్తున్నట్లు తమిళ వర్గాలు చెప్తున్నాయి. పీవీపి వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉందని,ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు వినికిడి. అయితే మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనే విషయం తెలియదు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మహేష్ 'శ్రీమంతుడు'తాజా విశేషాలకు వస్తే...
మహేష్బా బుహీరోగా మై త్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రుతి హాసన్ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్, శ్రుతిలతో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పొల్లాచిలో కొన్ని సన్నివేశాలు, పోరాట ఘట్టాలూ చిత్రీకరించారు.
షూటింగ్ తుది దశకు చేరుకొంటోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమాలో మహేష్ ధనవంతుడిగా కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా స్త్టెలిష్గా ఉంటుందని చెబుతున్నారు. అయితే టైటిల్పై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలీ, వెన్నెల కిషోర్, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.