Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఐశ్వర్యరాయ్తో ఎఫైర్ ఉదంటూ వ్యక్తి హంగామా!
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకుని తన భర్త అభిషేక్ బచ్చన్తో గత ఏడేళ్లుగా ఎంతో సంతోషంగా జీవితం సాగిస్తోంది. ఉన్నట్టుండి ఓ వ్యక్తి తెరపైకి వచ్చి ఆమెతో ఎఫైర్ ఉందంటూ నానా హంగామా సృష్టిస్తున్నాడు. అతన్ని శ్రీలంకకు చెందిన నిరోషన్ దేవప్రియగా గుర్తించినట్లు వార్తలు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తనకు గతంలో ఐశ్వర్యరాయ్తో ఎఫైర్ ఉందని, ఐశ్వరాయ్ అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకోవడం కారణంగా తాను మానసిక వేధనకు గురయ్యానని సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడని తెలుస్తోంది. ఆమెపై కేసు వేసేందుకు తన నైసీ రిఫర్ చేసిన ఓ లాయర్ను కూడా పెట్టుకున్నాడని, ఇందుకోసం రూ. 17 లక్షల రూపాయలుకూడా చెల్లించాడని...అయితే వారు ఐశ్వర్యరాయ్పై ఎలాంటి కేసు వేయకుండా అతన్ని మోసం చేసారని తెలుస్తోంది.
ప్రస్తుతం నిరోషన్ తన నైసీపై కోర్టులో కేసు వేసాడని, అతని వద్ద తీసుకున్న మొత్తాన్ని వాయిదా పద్దతుల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్పై ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తి ప్రస్తుతం చైనాలో ఉంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, మరో హీరో వివేక్ ఒబెరాయ్తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్లకు తెర దించుతూ ఐశ్వర్యరాయ్ 2007 అభిషేక్ బచ్చన్ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి ఆమె తన భర్త అభిషేక్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తోంది. ఉన్నట్టుండి శ్రీలంకకు చెందిన వ్యక్తి ఐశ్వర్యరాయ్తో ఎఫైర్ ఉందంటూ తెరపైకి రావడం చర్చనీయాంశం అయింది.