Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ మూవీలో విలన్ గా మంచు మనోజ్?
హైదరాబాద్: రామ్ చరణ్ త్వరలో తమిళంలో హిట్టయిన ‘థాని ఒరువన్' తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద స్వామి తెలుగులోనూ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అరవింద స్వామి కాదు... తెలుగు హీరో మంచు మనోజ్ ఈ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ స్పందిస్తూ.....విలన్ క్యారెక్టర్లో నటించాలనే కోరిక ఉన్నట్లు ఇటీవల తెలిపాడు. ఈ మేరకు చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి సినిమా నిర్మాతల నుండి అఫీషియల్ సమాచారం వస్తే తప్ప అసలు విషయం తేలనుంది.
ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు. డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.
రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. ఈ సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.
అల్లు అరవింద్ సలహా మేరకే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చాడని అంటున్నారు. థాని ఒరువన్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కేవలం కథ ఆధారంగా మాత్రమే నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్ను రూ. 25 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించే అవకాశం ఉంది.