Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇదేం పనంటూ...పూరి పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం?
హైదరాబాద్ : పూరి జగన్నాథ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు శత్రువు అయ్యాడనే వార్త ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చగా నిలుస్తోంది. రీసెంట్ గా జరిగిన లోఫల్ ఆడియో పంక్షన్ కు పూరి జగన్నాథ్..చిరంజీవి గానీ మరే మెగా హీరోని కానీ పిలవకపోవటం ఓ కారణం అయితే, మెగా ఫ్యాన్స్ కు శత్రువుగా ఉన్న వర్మను ఆహ్వానించటం మరొక కారణం అంటున్నారు.
దానికి తోడు వర్మ ...ఆడియో పంక్షన్ అనంతంరం చేసిన ట్వీట్స్ తో పూరి వాళ్ళు మరింత మండిపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా 'మెగా ట్రీ నుండి ఎలక్ట్రిక్ పవర్ ని తీసుకోకుండా, తన స్వంత సోలార్ బ్యాటరూ ద్వారా రావడం నాకు నచ్చింది' అని తెలిపారు.
ఆ తర్వాత... మళ్ళీ వర్మ ట్విట్టర్ లో"వరుణ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తి కాదని,..చెట్టుకి గౌరవం ఇస్తాడు కాని ...కోమ్మలాగా బ్రతకడం కోరుకోడని" చేసిన ట్వీట్ ఇప్పుడు చిచ్చు రేపింది.
మెగా కాంపౌండ్ కు చెందిన హీరో ఆడియో పంక్షన్ కు వచ్చిన వర్మ ఇలా కామెంట్స్ చేయటం అనేది సహజమే అయినా పూరి ఎలా తీసుకువచ్చాడంటున్నారు. మొత్తానికి దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి పూరి గురి అయ్యాడన్నమాట.