Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
పవన్ ని తక్కువ చేయటానికో మ్యాటర్ దొరికింది
హైదరాబాద్ : పవన్ ఇప్పుడు మరోసారి చిత్రంగా సోషల్ నెట్ వర్కింగ్ మీడియాలో హాట్ టాపిక్ గా..కొందరు గిట్టని వారికి టార్గెట్ గా మారారు. రజనీకాంత్ ని మోడి వెళ్లి కలిసిన వేళ.. పవన్ వెళ్లి మోడిని కలవటంతో పోలుస్తున్నారు. అలా పోల్చి రజనీకన్నా తక్కువే అని తేలుస్తున్నారు. పవన్ స్వయంగా వెళ్లి మోడిని కలిసాడని, అదే రజనీ దగ్గరకి వచ్చి మోడి కలిసాడు కాబట్టి అంటూ పనికిరాని లాజిక్ లు చెప్తున్నారు. ఈ విషయమై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ తను మనస్సులో అనుకున్నది చేసారు..అందులో రజనీతో పోల్చటానికి ఏముంది అంటున్నారు. అయితే ఓ వర్గం మాత్రం పవన్ ని ఈ ఇష్యూ చూపి..తక్కువ చేసే ప్రయత్నం చేస్తోంది.
ఇక రజనీకాంత్తో భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం చెన్నైలో దాదాపు అరగంటపాటు భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం చెన్నె వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పోయస్ గార్డెన్లోని రజనీ నివాసానికి వెళ్లారు. కాషాయ రంగు చొక్కా, ధోవతి ధరించిన మోడీ.. ఆయనకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మోడీతో కలిసి రజనీ మీడియాతో మాట్లాడారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు.
రజనీ మాట్లాడుతూ... ''నేను గతంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు మోడీ వచ్చి పరామర్శించారు. ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇంటికి రావాలని ఆయన్ను ఆహ్వానించా. ఇప్పుడు చెన్నై వచ్చిన మోడీ.. నాటి నా ఆహ్వానాన్ని గుర్తుపెట్టుకొని మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది'' అని తెలిపారు. తాను, మోడీ పరస్పర శ్రేయోభిలాషులమని, ఆయనకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. మోడీ బలమైన నాయకుడని, సమర్థ పాలకుడని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఆయనకు దేవుడు ఎప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన కోరుకొన్నది జరగాలని దేవుడిని ప్రార్థిస్తానని తెలిపారు.
మోడీ
మాట్లాడుతూ-
రజనీ
తనకు
మంచి
స్నేహితుడని
చెప్పారు.
సమావేశం
ఫొటోను
ఆయన
తర్వాత
'ట్విటర్'లో
పెట్టారు.
ఈ
నెల
24న
తమిళనాడులో
లోక్సభ
ఎన్నికలు
జరుగనున్న
నేపథ్యంలో
రజనీతో
మోడీ
భేటీ
ప్రాధాన్యం
సంతరించుకొంది.
భాజపా
రాష్ట్రంలో
డీఎండీకే,
ఎండీఎంకే,
పీఎంకే
సహా
ఆరు
పార్టీలతో
కలిసి
కూటమిగా
ఏర్పడి,
ఎన్నికల్లో
తలపడుతోంది.
మరో ప్రక్క పవన్ కల్యాణ్ను భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి కలిశారు. భాజపా తరపున ప్రచారానికి రావాలని పవన్ను కిషన్రెడ్డి కోరినట్లు సమాచారం. సన్నిహితులు, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతానని పవన్ చెప్పినట్లు తెలిసింది.