Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
జూ ఎన్టీఆర్, గుణశేఖర్ లపై విమర్శలు చేసినందుకేనా ఆ నిర్ణయం?
ప్రముఖ నిర్మాత, కవి, ఎమ్.ఎస్ రెడ్డి(అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి) రీసెంట్ గా తన ఆత్మకథను రాసారు. ఆ పుస్తకం పేరు ఇదీ నా కథ. ఈ పుస్తకం మీడియాలో ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఆ పుస్తకంలో పెద్ద ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్, గుణశేఖర్ వంటి కొందరుపై ఆయన డైరక్ట్ గా విమర్శలు గుప్పించారు. దాంతో పరిశ్రమలో ఓ వర్గం ఈ విషయం తీవ్రంగా పరిగణించటం జరిగింది. ఇది గమనించిన ఆయన కుమారుడు పరిశ్రమలో ఉన్న పరిచయాలు దెబ్బ తింటాయని వెంటనే ఆ పుస్తకం ప్రతులన్నీ మొత్తం వెనక్కి తెప్పించేసారు. ఒక్క పుస్తకం కూడా మార్కెట్లో దొరకటం లేదు. అలాగే మీడియా వారి వద్ద కూడా ఈ పుస్తక విషయమై మాట్లాడవద్దని తండ్రికి గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఎమ్.ఎస్ రెడ్డి మల్లెమాలగా బాగా సుప్రసిద్దులు. వీరి బ్యానర్ లో బాలరామాయణం చిత్రం గుణశేఖర్ చేసారు. అందులో రాముడుగా జూ.ఎన్టీఆర్ నటించారు.