Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Prabhas కోసం నాగ్ అశ్విన్ సెన్సేషనల్ ప్లాన్: RRRను మించిపోయేలా.. చరిత్రను సృష్టించే దిశగా అడుగు
కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, ఏక కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ స్టార్ హీరో అనౌన్స్ చేసిన చిత్రాల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కూడా ఉంది. పాన్ వరల్డ్ మూవీగా చెప్పుకుంటోన్న దీని విషయంలో తాజాగా సదరు దర్శకుడు ఓ సెన్సేషనల్ ప్లాన్ వేశాడని తెలిసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!
ఆ రెండింటితో రేంజ్ పెరిగిపోయింది
చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కానీ, దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పుడు అన్ని ఇండస్ట్రీలకూ పరిచయం అయ్యాడు. దీంతో ఆ తర్వాత వచ్చిన 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశాడు. ఇది హిందీలో రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకుంది.
ప్రభాస్ కెరీర్లోనే తొలిసారి ఆ పాత్ర
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
అదనుకుంటే... మిగతావి ప్రారంభం
'రాధే శ్యామ్' షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మూవీ ప్రకటించాడు. కానీ, నాగ్ అశ్విన్ మూవీ కంటే ముందే ఈ రెండు చిత్రాలను ప్రారంభించేశాడు.
అదే కాన్సెప్టు.. పాన్ వరల్డ్ మూవీ
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేసే మూవీలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్గా చేస్తోంది. ఇక, సినిమా కథ గురించి పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టైం మెషీన్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది.
వాయిదా పడిపోయిన భారీ చిత్రం
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల మొదలవలేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య మీడియాతో మాట్లాడిన దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని అక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని వెల్లడించాడు. కానీ, ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్లు ఆగిపోయాయి. దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
RRRను మించిలా డైరెక్టర్ ప్లాన్
ప్రభాస్తో చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్తో నాగ్ అశ్విన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. దీన్ని హాలీవుడ్ రేంజ్లో తీయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే ఎన్నో ప్లాన్లు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను RRRను మించిపోయేలా విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.
Recommended Video
చరిత్రను సృష్టించే దిశగా అడుగు
RRR మూవీని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం, ఇంగ్లీష్, ప్రోర్చుగీస్, కొరియన్, టర్నిష్, స్పానిష్ ఇలా పది భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ మాత్రం 15 భాషల్లో రాబోతుందట. పైన ఉన్న భాషలకు తోడు చైనా, జపనీస్ సహా మరో మూడు భాషల్లో కూడా ఇది రిలీజ్ కాబోతుందట. ఇదే జరిగితే ఇండియాలో చరిత్రే అవుతుంది.