Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగ చైతన్య 'ఏమాయ చేసావె' స్టోరీ లైన్ ...
నాగచైతన్య హీరోగా గౌతం మీనన్ రూపొందించిన 'ఏమాయ చేసావె' చిత్రం రేపు శుక్రవారం అంతటా రిలీజవుతోంది. దాంతో ఈ చిత్రం కథపై రకరకాల టాక్ లు బయిట వినపడుతోంది. ఫిలిం సర్కిల్స్ లో ఎక్కువుగా వినపడుతున్న దాన్ని బట్టి...ఈ కథలో నాగచైతన్య పేరు కార్తీక్. ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాల్లో దర్శకుడు అవుదామని ట్రైల్స్ వేస్తూంటాడు.అయితే కార్తీక్ తండ్రికి ఇష్టముండదు. ఇక ఈ విషయం తెలుసుకున్న మిత్రుడు కృష్ణుడు తనకున్న తెలిసున్న వారి ద్వారా దర్శకుడు పూరీ జగన్నాథ్ కు పరిచయం చేస్తాడు. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కార్తీక్ చేరుతాడు.
ఈ కథ ఇలా జరుగుతూంటే కార్తీక్..ఐటి కంపెనీలో పనేచేస్తున్న పక్కింటమ్మాయి జెస్సీతో పరిచయం అవుతుంది. మళయాళి క్రిస్టియన్ ఆమె. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారుతుంది.అయితే ఇక్కడో ఇబ్బంది ఉంటుంది. కార్తీక్ ప్రేమిస్తున్న అమ్మాయి కంటే రెండేళ్ళు వయస్సు తక్కువుగా ఉంటాడు. దాంతో పెద్దల ఒప్పుకోరు. అప్పుడు కార్తీక్ ఏం చేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ. ఇక ఈ చిత్రాన్ని త్రిష, శింబులతో తమిళంలో రూపొందించి అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు గౌతమ్ ఈ చిత్రానికి రెండు క్లైమాక్స్ లు రెడీ చేసారనే ఓ టాక్ వినపడుతోంది.