Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయ్యే మొదటి పెద్ద తెలుగు సినిమా ఏదంటే ?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇప్పటికే విధించిన లాక్ డౌన్ ను చాలావరకు సడలించారు. తెలంగాణలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. పాజిటివ్ రేటు కూడా తగ్గుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో సడలింపు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జరుగుతున్న ప్రచారం మేరకు జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణలో 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తారని అంటున్నారు.
ఒక వారం రోజుల తర్వాత పూర్తిస్థాయిలో సినిమా థియేటర్లు నడిచే లా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క ఏపీలో కూడా థియేటర్ల ఓపెనింగ్ విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒకవేళ అదే జరిగితే ముందుగా రిలీజయ్యే పెద్ద సినిమాలలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా పేరు అన్నిటికంటే ముందు వినిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాని తెలుగులో నారప్ప పేరుతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు.
ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటించాడు. థియేటర్ లు ఓపెన్ అయ్యాక రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలలో మొదటిదిగా ఈ సినిమానే నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. మరో వారంలో ఫస్ట్ కాపీ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కలై పులి es థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.. అయితే మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే..