Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆలోచించి,నీహారిక నెక్ట్స్ కు అదే బెస్ట్ అనుకుంది
హైదరాబాద్:మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె ..నీహారిక కొణిదల పెద్ద తెర ఎంట్రీ రీసెంట్ గానే జరిగిన సంగతి తెలిసిందే. రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ఒక మనసు చిత్రంతో ఆమె వెండితెరకెక్కింది. అయితే ఆ సినిమా ఊహించిన మేరకు కిక్ ఇవ్వలేకపోయింది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా చెప్పబడుతున్న ఆ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది.
దానికి తోడు ఆమెలోని ఉషారుని అంతా చంపేసే పాత్రలో దర్శకుడు బాగా డల్ గా చూపించాడు. చీర కట్టించి మరీ ఆమెను ఓ మెచ్యూర్డ్ లేడీగా కనిపించేలా చేసాడు. దాంతో ఆమెకు రావాల్సిన మైలేజీ రాలేదు. ఎంతో ఆసపెట్టుకుని వెళ్లిన మెగాభిమానులు నిరాశపడిపోయారు. ఈ నేపధ్యంలో ఆమె తన రెండో చిత్రం అయినా ఆచి,తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ సారి గ్లామర్ రోల్ కాకపోయినా ఆకర్షియంగా ఉంటే నటనకు ప్రయారిటీ ఇచ్చే పాత్రతో కనిపించాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ మేరకు ఆమె కథలు వింటోందని సమాచారం. అయితే ఈలోగా.. మరో మూవీలో నటించే ముందు బుల్లి తెరపై దర్శనమివ్వాలని నిహారిక నిర్ణయించుకుంది
నిహారికకు ఎంతో పేరు తీసుకొచ్చిన ముద్దపప్పు అవకాయ్ లో నటించేందుకు ఓటు వేసిందనిసమాచారం.. ఈ వెబ్ సీరియల్ దర్శకుడు ప్రవీణ్ స్క్రిప్ట్ రూపొందించే పనిలో పడ్డాడు.. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.