Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ తమిళ డైరక్టర్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్
తమిళ దర్శకుల దృష్టి అంతా ఇప్పుడు తెలుగు మార్కెట్ పై ఉంది.ఇక్కడ హీరోలకు తమిళ సినిమాలు,అక్కడ దర్శకులు నచ్చినట్లుగా తెలుగువారు నచ్చరనే సంగతి వారికి పూర్తిగా అర్దమైపోయింది.ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ని రీసెంట్ గా సుశీధరన్ అనే దర్శకుడు కలిసి స్టోరీ నేరేట్ చేసారు.సుశీధరన్ తాజాగా తమిళంలో రూపొందించిన నాన్ మహాన్ అల్లా చిత్రం తెలుగులో నాపేరు శివ గా విడుదలైంది.కార్తీ హీరోగా రూపొందిన ఈ చి్త్రం పెద్దగా ఆడకపోయినా బాగా తీసాడనే పేరు తెచ్చుకుంది.దాంతో ఆ దర్శకుడు తెలుగు హీరోల చుట్టూ తిరుగుతున్నాడు.ప్రభాస్ ని,ఎన్టీఆర్ ని కలిసి కథలు చెప్పాడు.ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించి నిర్మాతను నేనే చెప్తాను డిటేల్డ్ స్క్ర్రిప్టుతో కలవమన్నాడు.దాంతో అతను ప్రస్తుతం అదే పని మీద ఉన్నాడు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ..సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఊసరివిల్లి చిత్రంలో చేస్తున్నారు.తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చురకత్తి చిత్రం చేయనున్నారు.