మురుగదాస్ తో అల్లు అర్జునా ...ఎన్టీఆరా ...లేక..?

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వరుడు,ఎస్.జె.సూర్య-పవన్ కాంబినేషన్ లో పులి నిర్మిస్తున్న ఫైనాన్సర్ శింగనమల రమేష్ ఎన్టీ ఆర్ తో ఈ ప్రాజెక్టు చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినవస్తున్నాయి. రమేష్ వద్ద ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయని అయితే ఆయన వాటిని ఇలాంటి క్రేజి కాంబినేషన్ లో వినియోగిద్దామని యేచిస్తున్నట్లు చెపుతున్నారు. తాజాగా మురుగుదాస్ ...అమీర్ ఖాన్ ని గజనీ గా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కావంటతో ఆయన తన కుమారుడు తో మురుగుదాస్ కాంబినేషన్ ప్లాన్ చేసేందుకు మాట తీసుకున్నాడని అంటున్నారు. అందుకే అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్టు ఏమిటన్నది ఫైనలైజ్ చేయలేదని ఫిల్మ్ నగర్ న్యూస్ . దాంతో మురుగుదాస్ ఎన్టీఆర్ తో చేస్తారా ...అల్లు అర్జున్ తో చేస్తారా లేక ఇద్దరినీ కాదని రజనీకాంత్ ని డైరక్ట్ చేస్తారా అన్నది త్వరలో తేలనుంది.


Click it and Unblock the Notifications











