Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ కండలు పెంచేది అందుకేనా.. రోల్ రివీల్ అయిందా!
Recommended Video
ఈ ఏడాది రాబోతున్న చిత్రాలలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ప్రతిష్టాత్మకమైనది. తొలిసారి వీరి కలయికలో చిత్రం రాబోతోంది. కుటుంబ కథా చిత్రాలకు తన మాటల మాయాజాలాన్ని జోడించి అలరించడం త్రివిక్రమ్ శైలి. అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందినప్పటికీ త్రివిక్రమ్ పై నందమూరి అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది.
తొలిసారి ఎన్టీఆర్తో
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో రెండు చిత్రాలు, అల్లు అర్జున్ తో రెండు చిత్రాలు మరియు పవన్ కళ్యాణ్ తో మూడు చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండడం ఇదే తొలిసారి.
భారీ అంచనాలు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ మాటలతోనే కట్టిపడేయగలడు. దీనితో వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఘనవిజయం ఖాయం అని ఎన్టీఆర్ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొదలు కాబోతోంది
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపించబోతున్నాడా
ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ తన మేకోవర్ ని మార్చుకుంటున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ జిమ్లో కండలు తిరిగేలా కసరత్తులు చేస్తున్న ఫొటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ కసరత్తు త్రివిక్రమ్ కోసమే అని అంటున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్
ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజీ ఆఫర్లని అందుకుంటోంది. అందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.