Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మొత్తానికి ఎన్టీఆర్ ఓకే అన్నాడు,ఏం చేస్తాడో?
హైదరాబాద్: చాలా కాలంగా వక్కంతం వంశీ దర్శకుడుగా లాంచ్ అవటానికి ఎదురుచూపులు చూస్తున్నాడు. అదీ వేరే హీరోతో ముందుకు వెళ్లాలనుకుంటే కోరిక తీరిపోయేదేమో. ఆయన బిజీగా ఉన్న ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలనుకున్నాడు. ఎన్టీఆర్ కూడా మాట ఇవ్వటంతో వెయిటింగ్ లోనే చాలా కాలం గడిపాడు.
అంతేకాదు చాలా సార్లు మీడియా ముందు తన తొలి చిత్రం ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయబోతున్నానని, కథ రెడీ అవుతోందని చెప్పాడు. అయితే ఇంతకాలం అందుకు సమయం రాలేదు. రీసెంట్ గా వక్కంతం వంశీ కి ఎన్టీఆర్ ..స్క్రిప్టు ని లాక్ చేసుకోమని చెప్పారని సమాచారం.
సెప్టెంబర్ నుంచి సినిమా మొదలు పెడదామని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్ట్రార్ట్ చేసుకోమని పురమాయించినట్లు సమాచారం. దాంతో జూన్ నుంచి వక్కంతం వంశీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి, ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పూర్తి స్దాయి...యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఊహించని ట్విస్ట్ లతో సాగే విభిన్నమైన కథనంతో వక్కంతం తన తొలి చిత్రం కథను రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్...తన తాజా చిత్రం జనతా గ్యారేజ్ బిజీలో ఉన్నారు. ఆగస్టు 12 న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ ప్లానింగ్ మేరకు కొరటాల శివ శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నారు.