Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ నెక్ట్స్ డైరక్టర్ ఖరారు, ఆ రీమేక్ తోనే ముందుకు
హైదరాబాద్: అపీషియల్ అని చెప్పలేం కానీ , పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం కు దర్శకుడుని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. తమిళంలో జిల్లా అనే చిత్రం డైరక్ట్ చేసిన నేశన్ ని తన తదపరి చిత్రంకు డైరక్టర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ తమిళ రీమేక్ అని చెప్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు వేదాలం.
అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన వేదాలం చిత్రం అక్కడ రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. ఈ నేపధ్యంలో పవన్ ఈ సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం దర్శకుడుగా నేసన్ ని ఎంపిక చేసారని వినికిడి. ఈ విషయంపై తమిళ మీడియాతో నేసన్ మాట్లాడుతూ పవన్ తో డిస్కషన్స్ చేస్తున్నానని అన్నారు.
తన జిల్లా చిత్రం చూపించి నేసన్ ఓ కథ చెప్పి , గత కొద్ది రోజులుగా పనవ్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే పవన్ ..ముందు ఈ రీమేక్ చేయమని నేశన్ కు చెప్పి, పని ప్రారంభించమని, తెలుగు వెర్షన్ కు తగిన మార్పులు రైటర్స్ తో కూర్చుని చేయమని చెప్పారని చెప్పుకుంటున్నారు.
ఈ మేరకు దర్శకుడు నేశన్...ముందు పవన్ సినిమాలు వరస పెట్టి చూస్తున్నాడట. పవన్ ని ఎలా చూపెడితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనే విషయం అడిగి తెలుసుకుంటున్నారట. ఆ ఎలిమెంట్స్ అన్ని కలిపి వేదాలం తెలుగు వెర్షన్ కథ రెడీ చేసి పవన్ కు చెప్పి ఓకే చేయించుకుంటారని అంటున్నారు.