పవన్ కల్యాణ్తో పాన్ ఇండియా డైరెక్టర్ మూవీ.. దక్షిణాదిలో పాపులర్ నిర్మాత భారీ ప్రాజెక్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్తో జతకడుతున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతున్నది. ఈ సినిమాను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నదనే వార్త మీడియాలో క్రేజీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే సదరు సంస్థ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఆ నిర్మాణ సంస్థ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..
ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే పవన్ కల్యాణ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. పార్టీని, కార్యకర్తలకు అండగా ఉండటానికి ఆయన సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓజీ చిత్రం సుమారుగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు మరో మూవీని కూడా పట్టాలేక్కించే పనిలో ఉన్నారు. తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొన్న లోకేష్ కనకరాజ్ గానీ.. లేదా వినోద్ గానీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సేషనల్ న్యూస్ అధికారికంగా ప్రకటించనున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో అగ్ర నటులతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నది. ప్రస్తుతం దళపతి విజయ్తో జన నాయకన్, యష్తో టాక్సిక్, చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, ధ్రువ సర్జా హీరోగా కేడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్తో ఓ సినిమాను నిర్మించేందుకు నిర్ణయం తీసుకొన్నారు అని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











