Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాయకులకు కౌంటర్ ఇవ్వడానికి సిద్దమైన సాయి ధరమ్ తేజ్.. ఏ మాత్రం భయపడకుండా..
మెగా యువ హీరోల్లో ఆ మధ్య హిట్టు కోసం ఎక్కువగా స్ట్రగుల్ అయిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. వరుసగా ఆరు అపజయాలు ఎదురైనప్పటికి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక కథల విషయంలో అతని ఆలోచన విధానం కూడా మారుతోంది. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమా ఒకటి ప్రస్తుత రాజకీయ నాయకులకు కౌంటర్ ఇచ్చేలా ఉంటుందట. సాయి మొదటిసారి ఒక పెద్ద రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హ్యాట్రిక్ డిజాస్టర్స్
సాయి ధరమ్ తేజ్ అదృష్టం ఏమిటో గాని సక్సెస్ అనేది అంత ఈజీగా కంటిన్యూ అవ్వడం లేదు. సుప్రీమ్ సినిమా అనంతరం వరుసగా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ ను చూశాడు. ఆ స్థాయిలో దెబ్బ పడింది అంటే నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. కానీ సాయి అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ బలంగా పుంజుకున్నాడు అంటే అతని డెడికేషన్ కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
కెరీర్ బెస్ట్ హిట్
డిజాస్టర్స్ అవ్వడానికి గల కారణాలపై సిరియస్ గా ఫోకస్ పెట్టిన సాయి మెల్లగా చిత్రాలహరి సినిమాతో ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అనంతరం మారుతి దర్శకత్వంలో చేసిన ప్రతి రోజు పండగే సినిమా కూడా మంచి సక్సెస్ గా నిలిచింది. ఆ హిట్టుతో సాయి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు.
పొలిటికల్ డ్రామాగా
ఇక లాక్ డౌన్ అనంతరం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో వచ్చి పరవాలేదు అనిపించాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో రిపబ్లిక్ సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.
రాజకీయా నాయకులకు కౌంటర్
ఇక సినిమాలో తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలను క్లియర్ గా చూపించనున్నారట. ముఖ్యంగా నాయకుల తప్పులను ఎత్తి చూపిస్తూ పవర్ఫుల్ కౌంటర్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ కథపై సాయి ధరమ్ తేజ్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనాలకు ఓటు హక్కు విలువను కూడా అర్థమయ్యేలా చూపిస్తారట. మరి ఈ భారీ ప్రయోగంతో మెగా హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.