కజిన్ కోసం ప్రభాస్ వస్తాడు
హైదరాబాద్: ప్రభాస్ తన కజిన్ ప్రమోద్ ఉప్పలపాటి ప్రోడ్యూస్ చేసిన రన్ రాజా రన్, జిల్ సినిమాల ఆడియో పంక్షన్స్ కు కి వెళ్ళాడు. అలాగే ఇప్పుడు మరో చిత్రం ఆడియోకు కూడా హాజరుకానున్నట్లు సమచారం. వాళ్ల బ్యానర్ లో తాజాగా నిర్మించిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం ఆడీయోకి ప్రభాస్ రాబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఈ పంక్షన్ ని నిర్వహిస్తారు.

యు.వి. క్రియెషన్ మెదటి సినిమా మిర్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. తరువాత తీసిన రన్ రాజా రన్ పెద్ద హిట్ కాగా, జిల్ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. దాంతో ఇదే బ్యానర్ లో మేర్లపాక దర్శకత్వంలో రుపుదిద్దుకున్న ఎక్స్ ప్రేస్ రాజా చిత్రం పైనే అందరి దృష్టీ ఉంది. ఇదొక యూత్ పుల్ చిత్రం. బహుశ సంక్రాంతికి దగ్గరలో రిలీజ్ అయ్యే అవకాశలు ఉన్నాయి.

రన్ రాజా రన్'తో తన కెరీర్లో తొలి కమర్షియల్ విజయం అందుకొన్నాడు శర్వానంద్. ఇకపై కూడా పూర్తిస్థాయి వాణిజ్య చిత్రాల్లో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పుడు ఆ తరహా కథలనే ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నాడట. ఇందులో భాగంగా మేర్లపాక మురళి కథకి ఓకే చెప్పి ఈ సినిమా చేసాడని సమాచారం. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్'తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాడు గాంధీ. ఆ తరవాత గాంధీ ఓకే చేసిన ప్రాజెక్టు ఇదే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











