'బాహుబలి' స్పూఫ్ చూసి రాజమౌళి 'బాహుబలి-2' లో
హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో బ్రహ్మనందం తర్వత అంతాలా క్రేజ్ తెచ్చుకున్న నటుడు పృద్వి. మెన్నటి లౌక్యం నుండి నిన్న భలే మంచి రోజు వరకు వైవిధ్యమైన స్పూఫ్ లతో ఆకట్టుకున్న ఈ నటుడికి రాజమౌళి నుండి పిలుపోచ్చింది.
బాహుబలి సినిమాను స్పూఫ్ చేయడంలో సక్సస్ అయిన ఇతన్ని, బాహుబలి పార్ట్ - 2లో తీసుకోవాలని నిర్ణయించుకున్నారట రాజమౌళి. ఈలాగే కొనసాగితే ఇంక తనకు తిరుగులేదని భావిస్తున్నాడు ఈ స్పూఫ్ ల హీరో.
ప్రభాస్, రాణా,తమన్న మరియు అనుష్క ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు డైరక్టర్ రాజమౌళి, సంగీతం కీరవాణి. ఈ సంవత్సరంలోనే విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా షూటింగ్ మెదలైన సంగతి తెలిసిందే.
హిట్ సినిమాలు స్పూఫ్ చేయటం కామన్. అయితే ఈ మధ్యకాలంలో స్ఫూఫ్ లు పెద్దగా కనపడటం లేదు. కానీ హఠాత్తుగా ఈ నెలలోనే మూడు సినిమాల్లో స్ఫూఫ్ లు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ స్ఫూఫ్ లకు ఎంపిక చేసుకుంది మరే చిత్రాలో కాదు..శ్రీమంతుడు, బాహుబలి, గబ్బర్ సింగ్.

ప్రభాస్ బహుబలి సినిమాను దాదాపు నాలుగు సినిమాలలో స్ఫూఫ్ గా చేయగా ...శ్రీమంతుడు కూడా అదే స్థాయిలో స్పూఫ్ లకు ఎగబాకింది. కాకపోతే ఇందులో విశేషం ఎమిటంటే, ఈ సినిమాల స్పుఫ్ లలో ఎక్కువగా నటించి మెప్పించింది మాత్రం ధర్టి ఇయిర్స్ ఇండస్ట్రీ పృద్వియే కావటం విశేషం.
బాహుబలి లో శివలింగాన్ని ఎత్తిన సీన్ ను అనుకరించడంలో తనకు సాటి ఎవరు లేగని నిరుపించిన ఫృధ్వి.... భలే మంచి రోజు సినిమాలో కూడా పోలీస్ సినిమాల్లో డైలాగులు వరస పెట్టి చెప్పాడు. అంతేకాదు... మహేష్ శ్రీమంతుడు సునిమాలో డైలాగ్స్ అచ్చంగా దించి ఆడియన్స్ చేత ఈలలు వేయించాడు దియోటర్స్ లో. శంకరాభరణం సినిమాలో కూడా శ్రీమంతుడు డైలాగు చెప్పి విజిల్స్ వేయించాడు.
సౌఖ్యం సినిమాలో అయితే పూర్తిగా స్ఫూఫ్ ల మీదే నడిపే ప్రయత్నం చేసారు. ఇదే రీతిలో సప్తగిరి, షకలక శంకర్ కూడా వారి స్థాయిలో స్ఫూఫ్ లు చేసి వారు మెప్పించారు.


Click it and Unblock the Notifications











