twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ చైతన్య చిత్రంలో పూరీ జగన్నాధ్ గెస్ట్ రోల్

    By Srikanya
    |

    నాగార్జున, పూరీ జగన్నాధ్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకునే నాగ చైతన్య హీరోగా గౌతం మీనన్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. సినీ నేపధ్యంలో జరిగే ఈ ప్రేమ కథలో పూరీ జగన్నాధ్ తన రియల్ లైఫ్ పాత్ర అయిన దర్శకుడుగానే కనపడనున్నారు. నాగచైతన్య అసెస్టెంట్ డైరక్టర్ గా కనపడనున్నాడు. ఈ చిత్రానికి పూరీ గెస్ట్ అప్పీరియన్స్ ప్లస్ అవుతుందని బావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏం మాయ చేసావో అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ చిత్రానికి ఏఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక నాగచైతన్య ఈ చిత్రం పూర్తి కాకుండానే అజయ్ భువన్ దర్శకత్వంలో మరో చిత్రం కమిట్ అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అజయ్ భువన్ ఇంతకు ముందు హౌస్ ఫుల్ అనే చిత్రం రూపొందించారు. అది ఇంకా విడుదలకు నోచుకోలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X