షాకింగ్: పూరి జగన్...పూర్తి విప్లవ చిత్రం
హైదరాబాద్ : పూరి జగన్నాథ్ అంటే డైలాగులుకు, స్పీడుగా చిత్రాన్ని క్వాలిటీతో తెరకెక్కించటంలోనూ పెట్టింది పేరు. తాజాగ ఆయన చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా విప్లవం నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆర్. నారాయణ మూర్తి హీరోగా చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ మధ్యనే నారాయణ మూర్తిని కలిసిన పూరి ఓ కథని నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పూరి స్వంత బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కే అవకాసం ఉంది. ఈ చిత్రంలో నారాయణ మూర్తి పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుందని, నారాయణ మూర్తి ఇప్పటివరకూ ఏ సినిమాలో చూపని యాంగల్ లో చూపనున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఇంతకు ముందు సైతం పూరి జగన్నాథ్ తన టెంపర్ చిత్రంలో నారాయణ మూర్తిని అడగటం జరిగింది. అయితే నారాయణ మూర్తి నో చెప్పటంతో పోసాని ఆ పాత్ర చేసారు.

ఇక ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా పూర్తవటంతో తన భవిష్యత్ సినిమాల పనిలో పడిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ తెలిపాడు. తను ఛార్మీ తో తీయబోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్లడించాడు. అయితే ఈ సినిమా నర్తకి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామని వెల్లడించాడు.
పేరు క్యాచీగా ఉండాలని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుందని అది ఓకే చేశామని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిలక్ష్మి నిజ జీవితానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications











