twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్నాథ్ రిజిస్ట్రేషన్ చేసిన కొత్త టైటిల్

    By Srikanya
    |

    Puri Jagannath
    హైదరాబాద్: పూరీ జగన్నాథ్ తాజాగా అసెంబ్లీ రౌడీ..వీడికి తిరుగులేదు అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో తమ బ్యానర్ తరపున రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ ,మంచు విష్ణు కాంబినేషన్ లో అసెంబ్లీ రౌడీ రీమేక్ రూపొందనుందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

    మోహన్ బాబు హీరోగా చేసిన 'అసెంబ్లీ రౌడీ'ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ చేస్తారని చాలా కాలం నుంచి వినపడుతోంది. అయితే రకరాల దర్శకులనుప అనుకున్నప్పడికీ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంచుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

    ఇక ఈ చిత్రంలోని అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా జైల్లోపెడతా... అనే డైలాగులు అప్పట్లో ఎక్కడ విన్నా వినపడేవి. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ 'అసెంబ్లీ రౌడీ'చిత్రం రీమేక్ కాబోతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది.

    ఈతరానికి నచ్చేలా, వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతన్నాయి. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'దూసుకెళ్తా' చిత్రీకరణ తుది దశకు చేరింది. ఈ చిత్రం పూర్తయిన తరవాత 'అసెంబ్లీ రౌడీ' సెట్స్‌ మీదకు వెళ్ళే అవకాసం ఉందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఈ మేరకు కొత్త స్క్ర్రిప్టుని రెడీ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో 'అందమైన వెన్నెలలోన'పాటని సైతం రీమిక్స్ చేస్తారని తెలుస్తోంది.

    English summary
    
 It is known that Manchu Vishnu is getting ready to star in the re-make of his dad Mohan Babu's hit Film ‘Assembly Rowdy’.Puri Jagannath who is directing the film registered the title with the film chamber. Film comes with a tagline 'veediki tiruguledu'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X