Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పూరీ,నితిన్ చిత్రం షూటింగ్ ఏ దేశంలో ?
రెండు వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతోంది. గతంలో వైష్ణో అకాడమీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తను ప్రారంభించిన కొత్త బ్యానర్ పూరీ జగన్నాథ్ టాకీస్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటిసారి వీరి కలయికలో తెరకెక్కే ఈ చిత్రం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ విషయాన్ని హీరో నితిన్ తెలియజేస్తూ, 'పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. ఆయన చెప్పిన సబ్జెక్టు వినగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ చేద్దామా! అన్న ఆతృత మొదలైంది. వ్యాపారాత్మక అంశాలు ఉన్న ఓ విభిన్నమైన ప్రేమకథ ఇది. ఈ నెలాఖరు నుంచి నిరవధికంగా యూరప్, గోవాలలో ఈ చిత్రం భారీ షెడ్యూల్స్ జరుగుతాయి. తప్పకుండా నా కెరీర్లో ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న నమ్మకం ఉంది. నా సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. మిగిలిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని అన్నారు.
బాలీవుడ్ భామ ఆద శర్మని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈమె ఫిర్,1920 చిత్రాలు చేసింది. నితిన్ కి ఆమె కరెక్టు పెయిర్ అని ఫోటో షూట్ చేసి పూరి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. షూటింగుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.