Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్-కృష్ణ వంశీ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్
జనవరి 23,2014 నుంచి చిత్రం రెగ్యులర్ షూట్ జరగనుంది. బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం లొకేషన్స్ వెతుకుతున్నారు. పొల్లాచ్చి లో మొదటి షెడ్యూల్ జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ చిత్రంలో వెంకటేష్ లేరని సమాచారం. ఆ ప్లేస్ లోకి శ్రీకాంత్ వచ్చి చేరారని తెలుస్తోంది. జనవరి 2014 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం కుటుంబ అనుబంధాలు చుట్టూ తిరగనుంది.
వెంకటేష్ ని కీలకమైన పాత్రలో అనుకున్నా..ఆయనకు హీరోయిన్ దొరక్కపోవటంతో బయిటకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాక రామ్ చరణ్ కే కథలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం, బల్క్ డేట్స్ కావాల్సి రావటంతో వెంకటేష్ తప్పుకోవటానికి కారణాలు గా చెప్తున్నారు. సంక్రాంతి నుంచి ఆస్ట్రేలియా షెడ్యూల్ తో సినిమా ప్రారంభం అవుతుంది.
ఈ సినిమాపై ఓ రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రం స్టోరీ లైన్ హిందీ మూవీ 'కభి ఖుషీ కభి ఘమ్' స్టోరీని పోలి ఉంటుందట. ఏది ఏమైనా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే వెంకటేష్-మహేష్ బాబు మల్టీ స్టారర్గా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మంచి విజయం సాధించింది. అయితే మరో వైపు వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ మసాలా విడుదలై డిజాస్టర్ అయ్యింది.