‘జగదీకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్ లో రామ్ చరణ్ తేజ!
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మానంలో మెగాస్టార్ చిరంజీవి, అందలా తార శ్రీదేవి జంటగా 'జగదీకవీరుడు-అతిలోకసుందరి" చిత్రం రూపొందింది. ఈ సినిమా అప్పుట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్య 2 సీక్వెల్ సినిమా లాగా జగదీకవీరుడు-అతిలోకసుందరి సినిమాకి సీక్వెల్ రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందే ఈ చిత్రం ద్వారా శ్రీదేవి తనయ జాహ్నవిని కథానాయికగా పరిచయం చేయనున్నారని సమాచారం.
2014వ సంవత్సరంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందట. బోనీకపూర్, శ్రీదేవిల దగ్గర ఈ విషయం గురించి చిరంజీవి చర్చించాడట. ఈ ప్రపోజల్ కు బోనీకపూర్, శ్రీదేవిలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయుటకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారని సమాచారము.
రామ్ చరణ్ తేజ్ చిరంజీవి శ్రీదేవి జాహ్నవి జగదేకవీరుడు అతిలోక సుందరి బోనీకపూర్ ram charan tej jahnavi jagadekaveerudu athilokasundari chiranjeevi sridevi daughter


Click it and Unblock the Notifications