Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి కూతురు సైతం నిర్మాతగా....
ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అదేంటంటే...హీరోలైన తమ సోదరులతో సినిమాలు నిర్మిస్తూ బిజిగా ఉండటం. మంజుల తన సోదరుడు మహేష్ తో సినిమ చేస్తోంది. అలాగే నాగసుశీల తన సోదరుడు నాగార్జునతో సినిమా చేస్తోంది. ఇక మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా విష్ణు, మనోజ్ లతో సినిమా చేస్తోంది. వీటిన్నటినీ గమనించిన రామ్ చరణ్ సోదరి సుస్మిత కూడా నిర్మాతగా రంగంలోకి దిగనుంది. ఆమె భర్త చెన్నైకి చెందిన ఓ పెద్ద బిజెనెస్ మాగ్నెట్. అతనితో పెట్టుబడి పెట్టించి సోదరుడు రామ్ చరణ్ హీరగా సినిమా చేయనుంది. ఈ విషయానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ కు తోడుగా మరో నిర్మాణ సంస్ద చిరు ఫ్యామిలీనుంచి రానుందన్నమాట. ఇక ఆమె నిర్మించబోయే చిత్రం రామ్ చరణ్ నెక్ట్స్ చిత్రం అంటున్నారు. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలోఈ చిత్రం రూపొందనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చే ఆ సినిమా సూపర్ మేన్, హృతిక్ రోషన్ క్రిష్ తరహా కథనంతో ఉంటుందని చెప్తున్నారు.ఇక ధరణి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించారు.