ఎఎన్నార్ కి జంటగా రేఖ ఎంపిక?

By Srikanya

హైదరాబాద్ :అక్కినేని త్రయం నటిస్తున్న 'మనం' సినిమాకి కొబ్బరికాయ కొట్టి రెండు రోజుల క్రితం మొదలెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రమిది.

ఈ చిత్రంలో శ్రియ, సమంత ...నాగార్జున,నాగచైతన్యలకు హీరోయిన్స్ గా చేస్తున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి అక్కినేని నాగేశ్వరరావు కు జోడిగా ఎవరని తీసుకువస్తారు అనే సందేహం చాలా మందికి కలిగింది. అయితే రేఖను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతన్నట్లు సమాచారం.

మరో ప్రక్క రోహిణి హట్టంగిడి పేరు కూడా నలుగుతోంది. రేఖ నో చెపితే ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే రేఖను పెడితే క్రేజ్ వేరే రకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వారంలో ఫైనలైజ్ అవుతుందని అంటున్నారు.

ఇక సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. నాగచైతన్య కెమెరా ముందుకు వచ్చినప్పటి నుంచీ అక్కినేని హీరోలు ముగ్గురూ నటించే చిత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 'ఇష్క్‌' రూపొందించిన విక్రమ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం, పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X