twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మనం' పై వివాదం..సెన్సార్ చూసుకోలేదా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : రిలీజైన సినిమాలలలోని సన్నివేశాలపై ఏదో వివాదం రావటం, దాని దర్శక,నిర్మాతలు దాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేయటం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణంగా మారింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంపై మతపరమైన వివాదం మొదలయ్యిందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై క్రైస్తవ మత సంఘాలు మండిపడుతున్నట్లు చెప్పుతున్నారు. అయితే అఫీషియల్ గా ఎక్కడా దీనిపై కథనాలు మాత్రం రాలేదు.

    ఈ చిత్రంలోని ఎమ్ ఎస్ నారాయణ పాత్ర ...హీరో నాగచైతన్య చదివే కాలేజీ ప్రిన్స్ పాల్ పాత్ర. నాగచైతన్య ఈ ప్రిన్స్ పాల్ ని అన్ని సినిమాల్లో లాగానే ఏడిపిస్తూంటాడు. ఈ ఎపిసోడ్ లో ప్రైయిజ్ ది లార్డ్ అంటూ కొన్ని మతాన్ని గుర్తు చేసే పదాలు దొర్లాయి. ముఖ్యంగా ఆ పాత్ర... తన ప్రేమ వ్యవహారం దెబ్బ తినటంతో ఇలా ఫాధర్ గా మారి ప్రిన్స్ పాల్ ని అయ్యానని అంటాడు. అలాగే ఓ చోట నాగచైతన్య..ఈ ఫాధర్ పై కక్కుతాడు. దాంతో క్రైస్తవలు ఇలా తమ మతంలోని గురువు లాంటి ఫాధర్ ని ఇలా కామెడీ కోసం చీప్ గా చేయటం బాగోలేదని నాగార్జునని సంప్రదించారట. నాగ్ మాత్రం ఈ వివాదం హైలెట్ అవ్వకుండా దీనికి పరిష్కారం వెతికే ఆలోచనలో ఉన్నారట. అయినా సెన్సార్ బోర్డ్ ఎలా ఈ సన్నివేశాలను వదిలేసింది అంటున్నారు.

    Religious Controversy Hits Nagarjuna's Manam?

    కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    In the movie 'Manam', MS Narayana is shown as a college principal in a Christian Father getup. All the time MS uses the line 'Praise the Lord “ May the Lord be praised' to deliver some fun. Also in a scene Chaitanya actually mentions that he vomited on Father's dress after consuming too much of liquor. It seems like few Christian associations are unhappy with the portrayal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X