Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్కవుట్ అయ్యిందా,జూ. ఎన్టీఆర్ గతంలో చేసిన నిర్మాతలకు కూడా పండగే
ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జతగా నటించిన ‘టెంపర్’ చిత్రం హిందీ రీమేక్ కు సిద్దమవుతోంది.
ముంబయి: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జతగా నటించిన 'టెంపర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తమిళం, హిందీల్లో రీమేక్ చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. అయితే హిందీ రీమేక్ని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్ ఎన్టీఆర్ పాత్రలో కన్పించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే టెంపర్ విడుదలైన కొన్ని నెలలకే బాలీవుడ్ నిర్మాత, నటుడు సచిన్ జోషి ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కించే రీమేక్లో కాజల్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం హిట్టైతే హిందీ పరిశ్రమ దృష్టి ఎన్టీఆర్ సినిమాలపై పడుతుంది.
ఇక వరస పెట్టి ఎన్టీఆర్ సినిమాలు రీమేక్ చేసే అవకాసం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినిమా ప్రారంభం అయితే ఆ సినిమా కథ ఏంటని ఎంక్వైరీ చేసి, అడ్వాన్స్ ఇచ్చే రోజులు వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ తో గతంలో హిట్ సినిమాలు తీసిన నిర్మాతలకు కూడా రీమేక్ రైట్స్ ఆఫర్స్ వస్తాయని చెప్పుకుంటున్నారు.
టెంపర్ దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ..''బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ హిందీలో సినిమా వేగంగా పట్టాలెక్కడం కష్టం. ఓ ఆరేడు నెలలు ఉండాలి. అలా ఉంటే తెలుగు సినిమాలకి దూరం కావాల్సి వుంటుంది. అందుకే ఇక్కడే సినిమాలు చేస్తున్నా. అయితే ఆమధ్య అభిషేక్ బచ్చన్తో 'టెంపర్' చేద్దామనుకొన్నా. ఆయనకి కథ చెబితే ఎన్టీఆర్లా అంతటి భావోద్వేగాలు పండించలేను అన్నారు. దాంతో ఆగిపోయా.'' అన్నారు.
ప్రస్తుతం దర్శకుడు రోహిత్ శెట్టి ప్రస్తుతం గోల్ మాల్ 4 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రణవీర్ సింగ్ అయితే.. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో కీలక పాత్రతో ఆకట్టుకోబోతున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో టెంపర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రణవీర్ సింగ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ అనగానే.. బాలీవుడ్ లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. అదీ సక్సెస్ ఫుల్ రీమేక్ కావటంతో ఇక చెప్పేదేముంది.