Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సాహో దర్శకుడు మళ్ళీ ఫోకస్ పెట్టాడు.. ఆ హీరో ఒప్పుకుంటే లక్కీ ఛాన్స్ కొట్టినట్లే?
ఫస్ట్ టైం శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ మూవీ తో సుజిత్ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టింది. ఇక ఇందులోని సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి. ఆ విధంగా రన్ రాజా రన్ మూవీకి అదిరిపోయేలా సాంగ్స్ తీసుకున్నారు సుజీత్. దానితో బాహుబలి వంటి భారీ విజయాల తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సుజీత్ కి తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ తో ప్రభాస్ చేసిన సినిమానే సాహో. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కి 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు లో యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ అటు నార్త్ లో మాత్రం భారీగా సక్సెస్ సాధించి అద్భుతంగా కలెక్షన్స్ అందుకుంది. భారీ యాక్షన్ తో కూడిన విజువల్ వండర్ గా సుజీత్ తీసిన ఈ సినిమాలో సాంగ్స్ బాగానే ఆకట్టుకోగా కథ, స్క్రీన్ ప్లే పరంగా ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమాని ఆడియన్స్ పెద్దగా ఆదరించలేదు. అయితే ఆ తరువాత సుజీత్, మెగాస్టార్ తో ఒక సినిమా చేయనున్నారు అంటూ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక అసలు విషయం ఏమిటంటే, లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ప్రభాస్ తోనే త్వరలో మరొకసారి సుజీత్ తో ఒక భారీ సినిమా చేయనున్నారట.
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పాత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపిస్తాడట, భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ స్టోరీపై ఇప్పటికే ప్రభాస్ పాజిటివ్ గా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ దీని పూర్తి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని, త్వరలో అది ప్రభాస్ కి వినిపించిన అనంతరం దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు. అయితే ఇటీవల రాధేశ్యామ్ షూట్ మొత్తం పూర్తి చేసిన ప్రభాస్, ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజక్ట్ కె సినిమాలు చేస్తున్నారు.
మరోవైపు ఏ మాత్రం షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా ఈ మూడు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారని, అయితే ఇవి పూర్తి అయిన తరువాతనే సుజిత్ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఒకవేళ సినిమా సెట్టయితే సాహో తరహాలో ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సుజీత్ కి ప్రభాస్ ఒకింత గట్టిగా సూచన చేసారని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లపాటు ఎదురుచూడక తప్పదు. ఇక సుజిత్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.