Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ.ఎన్టీఆర్ జోడి కోసం సమంత పెంచేసింది
హైదరాబాద్ : సమంత,ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం నిమిత్తం సమంత భారీగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. కోటిన్నర ఆమె తీసుకుంటోం దని సమాచారం. ఆమె డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోవటంతో ఆ రేంజిలో రెమ్యునేషన్ పెంచినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ తదుపరి చిత్రం లో కూడా ఆమెనే తీసుకున్నారు. ఇద్దరి సినిమాల్లోనూ ఎన్టీఆర్ హీరో,అలాగే ఇద్దరూ సమంతనే జంటగా కోరుకోవటం విశేషం. సమంత,ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో బృందావనం చిత్రం వచ్చి హిట్టైంది.
అయితే ఆమె రెమ్యునేషన్ పెంచటం నిజం కాదని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ తో రెండు చిత్రాలు చేయటం వరకూ నిజమే కానీ..రెమ్యేనేషన్ పెంచటం మాత్రం కేవలం రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో అని ఆమె ఆశ్చర్యపోతోందని అన్నారు. అయితే డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెంచటం వింతైన విషయమూ కాదు..తప్పూ కాదు..ఆమె పెంచకపోయినా నిర్మాతలైనా తమ డేట్స్ కోసమైనా పెంచుతారని పరిశ్రమలోని సీనియర్స్ అంటున్నారు.
ఆ మధ్యన సమంతకు హెల్త్ బాగోకపోవటంతో కొన్ని నెలలు పాటు షూటింగ్ లకు దూరమైంది. ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన అనారోగ్యం మేలే చేసిందని చెప్తోంది. ఆమె మాటల్లోనే...కొన్ని నెలలు షూటింగ్లకు దూరమవటం...అనారోగ్యం వల్ల తప్పలేదు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే కాస్త విరామం తీసుకున్నాను. అయినా అనారోగ్యం మంచే చేసింది అంది.
తాజా రిలీజ్ చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' గురించి చెప్తూ... నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. నిత్య అనే యువతిగా కనిపిస్తాను. ఈ కథ విన్న వెంటనే నచ్చింది. కానీ నేను చేయగలనా అనే ఆలోచన కూడా మొదలైంది. ఓ మంచి పాత్రకు న్యాయం చేయాలని చాలా కష్టపడ్డాను. 'ఏ మాయ చేసావె'లో జెస్సీలాగే నిత్య కూడా గుర్తుండిపోతుంది అంది.
'ఎటో వెళ్లిపోయింది మనసు' లో ప్రేమ కథ మూడు దశలుగా ఉంటుంది. .. స్కూల్ దశలో ఆలోచనలు ఎలా ఉంటాయి?.. అవి కళాశాల స్థాయికి వెళ్లాక ఏ రీతిన మారతాయి?.. ఆపైన మానసిక పరిపక్వతతో ఏం చేస్తారు?.. అనే అంశాల్ని చూపించారు. ఆ దశలను పాత్రలో ప్రతిఫలింపజేయడం క్లిష్టమైన ప్రక్రియే. దర్శకుడు గౌతమ్ మీనన్ సూచనలకు తగ్గట్టు నటించాను అని చెప్పింది.