Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మిస్సిండియాను పక్కనపెట్టి మరో భామతో కళ్యాణ్ రామ్
హైదరాబాద్: చాలా కాలం తర్వాత ‘పటాస్' సినిమాతో విజయం రుచి చూసిన కళ్యాణ్ రామ్ తన తర్వాతి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘షేర్'. కళ్యాణ్ రామ్ గత సినిమా ‘కత్తి'కి దర్శకత్వం వహించిన మల్లికార్జున ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో మిస్ ఇండియా వరల్డ్-2012 వన్యా మిశ్రా హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్టు పూర్తయింది. ఉన్నట్టుండి ఆమెను తీసేసి మరో హీరోయిన్ తో మళ్లీ సీన్లు రీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ‘లెజెండ్' చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ కాకుండా అందరికీ తెలిసిన ఫేస్ అయితే సినిమా ప్లస్సవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
సాయి నిహారిక సమర్పణలో విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మాణ సారధ్యంలో ‘షేర్' మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ దాదాపు పూర్తయినట్లే, కొన్ని సాంగులు మాత్రమే పెండింగులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మరోసారి కళ్యాణ్ రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు.