Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగచైతన్య నో అంటే...సుధీర్ బాబు సై అన్నాడు
ఛార్మినార్ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ రీమేక్ చేస్తున్నారు. కన్నడంలో డైరక్ట్ చేసిన చుండ్రునే ఈ చిత్రానికి సైతం డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు కన్నడ చిత్రం గోవిందాయనమహ ని పోటుగాడు గా రీమేక్ చేసిన శ్రీధర్ ...ఈ ఛార్మినార్ చిత్రం సైతం తనకు విజయం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రేమ కధా చిత్రం కాంబినేషన్ కావటంతో బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.
ఇక తడాఖా'తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా 'మనం' షూటింగ్లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని ఈ నెల్లోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు.