Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రంగస్థలం తర్వాత చిరంజీవితో సినిమా.. సుకుమార్ క్లారిటీ..
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా రాంచరణ్, సమంతతో రూపొందించిన చిత్రం రంగస్థలం సినిమా రిలీజ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో హల్చల్ చేస్తున్నది. రంగస్థలం చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ విషయంపై సుకుమార్ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..
Recommended Video
చిరంజీవితో సినిమా
చిరంజీవితో సినిమా తీసే అవకాశం అనేది నిజంగా అద్భుతమైన ఛాన్స్. కానీ ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్త కేవలం గాసిప్ మాత్రమే. చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మెగాస్టార్తో కలిసి పనిచేయడమనేది ఓ కల అని సుకుమార్ అన్నారు.
చిరంజీవిని సంప్రదించలేదు
చిరంజీవితో సినిమా రూపొందించాలనే ఆశ ఉంది. కానీ ఇప్పటివరకు ఆయనను సంప్రదించలేదు. అవకాశం వస్తే చిరంజీవితో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను అని సుకుమార్ తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం.
సైరా బిజిలో చిరంజీవి
ప్రస్తుతం చిరంజీవి చారిత్రాత్మక చిత్రం సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 ఘన విజయం తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రమిదే. ఆ తర్వాత చిరంజీవి నటించే చిత్రంపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో సుకుమార్ చిత్రానికి సంబంధించిన వార్త వైరల్గా మారింది.
30న రంగస్థలం రిలీజ్
1980 గ్రామీణ వాతావరణంతో దర్శకుడు సుకుమార్ రూపొందించిన రంగస్థలం చిత్రం మార్చి 30న రిలీజ్కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లు, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది.