Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చెర్రీ, సుక్కూ చిత్రం టైటిల్ ఇదే?, భలే వెరైటీగా ఉందే
హైదరాబాద్ : రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబోలో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న ''ధ్రువ'' షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలకానుంది.
ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో కొత్తేముంది అంటారా...ఇప్పుడు ఈ చిత్రం టైటిల్ విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ బయిలుదేరింది. దాన్ని మీముందు ఉంచటమే ఈ కథనం.
ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పిఎమ్' అని పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు హీరో, దర్శకుడు మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ తరహా టైటిల్ అయితే జనాల్లోకి బాగా స్పీడుగా వెళ్తుందని సుకుమార్ భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మొదలయ్యే ప్రేమ కథ ఇది అని స్పష్టంగా తెలుస్తోంది.
సుకుమార్, రామ్ చరణ్ చిత్రం : బడ్జెట్ అంతా? ,వర్కవుట్ అవుద్దా?
ఈపరిస్థితుల్లో ఈ సినిమా కథాంశం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశమనేది ఓ ప్రక్కన ప్రచారం జరుగుతోంది.
కోనసీమ బ్యాక్ డ్రాప్లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశారని,. నవంబరు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సినీవర్గాలు అంటున్నాయి.