Don't Miss!
- News సుమలత దెబ్బకు సతమతం, అయోమయంలో నడ్డా, ఏం జరిగినా వదిలే ప్రసక్తలేదు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ !
- Sports Ravichandran Ashwin:అతను ధోనీకి లెఫ్టాండ్ వర్షన్!
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
చరణ్ కోసం సుకుమార్ స్పెషల్ స్కెచ్
హైదరాబాద్: మేధావి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ...తన గత రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ గా విదేశాలను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి చిత్రానికి సైతం యుఎస్ నేపధ్యంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన యుఎస్ లోనే ఆ లొకేషన్స్ లోనే తిరుగుతూ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రీసెంట్ చిత్రం నాన్నకు ప్రేమతో...మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సక్సెస్ ఫుల్ గా భాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఈ నేఫధ్యంలో అయనకు తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా ఓకే అయ్యింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ ఒకే సారి విని ..స్టోరీ లైన్ ని ఓకే చేసారని, త్వరలోనే ట్రీట్ మెంట్ వెర్షన్ వారికి వినిపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
సినిమా కథ యుఎస్ లో జరుగుతుందని, అందుకుని అక్కడ రియల్ లొకేషన్స్ లో తిరిగుతూ స్క్రిప్టు రాసినట్లు ఉంటుంది. అలాగే బ్రేక్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుందని సుకుమార్ ఈ ట్రిప్ పెట్టాడంటున్నారు. ఈ ట్రిప్ లో ఆయన ఫ్యామిలితో కలిసి వెళ్లాడని సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తని ఒరవన్ చిత్రం చేస్తున్నారు. ధృవ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తనను బ్రూస్ లీ ప్లాఫ్ నుంచి బయిట పడేస్తుందని భావిస్తున్నాడు. సుకుమార్ తో చేయటం ద్వారా తనకు యుఎస్ లో మార్కెట్ పెరుగుతుందని రామ్ చరణ్ ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు.