Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కృతజ్ఞతతో కళ్యాణ్రామ్ ని డైరక్ట్ చేస్తాడట
హైదరాబాద్ :రీసెంట్ గా పటాస్తో మంచి హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్రామ్ ఇప్పుడు తన కెరీర్ పై మరింత కేర్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. రవితేజ సురేందర్రెడ్డిల కలయికతో రూపొందుతున్న ఈ సినిమా తరువాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అతనొక్కడే సినిమాతో సురేందర్రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్రామ్. ఇప్పటికే సురేందర్రెడ్డి కూడా కళ్యాణ్రామ్ హీరోగా ఓ సినిమా చేస్తానని చెప్పినట్టు తెలిసింది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పటాస్ కు ముందు వరస ఫ్లాఫులు రావటంతో ఇక నుంచి అలాంటి పరిస్ధితి రిపీట్ కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తను హీరోగా చేసే సినిమాల కథలు,దర్శకులను ఆచి తూచి ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పిల్లా నువ్వు లేని జీవితం దర్శకుడు రవికుమార్ చౌదరితో సినిమా కమిటయ్యారు. దిల్ రాజు నిర్మాతగ ఈ చిత్రం ఉంటుంది. ఈ లోగా మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న షేర్ చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సురేంద్ర రెడ్డి చిత్రం చేస్తారు. ప్రస్తుతం నిర్మాతగా కిక్-2 సినిమాను నిర్మిస్తున్నాడు.
షేర్ చిత్రం విషయానికి వస్తే..
మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ అప్పుడే తన తదుపరి సినిమాతో సిద్దమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ చేస్తున్న తదుపరి సినిమా ‘షేర్'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
పటాస్ సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.