Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆయన 'పక్క' న అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నాను..!
నందమూరి బాలయ్య బాబు ఏమి చేసినా అది అందమే. సింహా తర్వాత నందమూరి బాలకృష్ణ మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. ఈ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు వంటి అతిరథ మహారధులు హాజరయ్యారు. బాలయ్యపై తీసిన ముహూర్తపు షాట్ కు చంద్రబాబు నాయుడు క్లాప్ నివ్వగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పరుచూరి మురళి దర్శకత్వంలో నటించే కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని డాక్టర్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో ఒకరు సిమ్రాన్ కాగా, మిగిలిన ఇద్దరు ప్రణీత, స్నేహా ఉల్లాల్ లను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్ లతో బాలయ్య నటించిన సింహా చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్తో ఇంకా టైటిల్ ఖరారు కాని కొత్త చిత్రంలో ముగ్గురు భామలతో కలసి నటించడం బాలకృష్ణకు కలిసొస్తుందని ఫిలిమ్ సిటివర్గాల సమాచారం. ఈ విషయంపై ప్రణీత మాట్లాడుతూ బాలకృష్ణ గారి సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.
ప్రస్తుతం బాలయ్య బాబు దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో పరమవీరచక్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కులు మనాలిలో కొన్ని మిలిటరీకి సంబంధించిన సన్నివేశాలను తీయడం జరుగుతుంది. దాదాపుగా బాలయ్య బాబు నటిస్తున్న పరమవీరచక్ర 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని ఇటీవలే యూనిట్ సభ్యులు వెల్లడించడం జరిగినది. ఇదేవిధంగా పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం కూడా క్రేజీ ప్రాజెక్టు అవుతుందని బాలయ్య బాబు అభిమానులు అందరూ అందరూ అనుకుంటున్నారు. పెదబాబు, ఆంధ్రుడు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి బాలయ్యను విభిన్న గెటప్తో ప్రేక్షకులకు చూపించనున్నారు. అంతేకాకుండా పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య బాబు త్రిపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు తరాలను ప్రతిభింబించే ఈ పాత్ర డిజైన్స్ ని కంప్యూటర్ లో తయారుచేసుకుని బాలయ్యచేత ఓకే చేయించుకుని ఆ గెటప్స్ రెడీ చేసే పనిలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఊటీలో కానీ మౌంట్ ఆబులో కానీ చిత్రం షూటింగ్ ఉంటుందని దర్శకుడు పరుచూరి మురళి వివరించారు. ఈ సినిమాని శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మాకుమార్ చౌదరి నిర్మించునున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ కోన్ని బాలయ్య బాబు అభిమానులను సైతం ముక్కున వేలువేసుకోనే విధంగా ఉన్నాయని సినీ పండితులు అనుకుంటున్నారు.