యంగ్ హీరో సినిమా TDP ప్రచారం కోసమే?

నారా రోహిత్ మాట్లాడుతూ... ఓటు వేయని ప్రజలకు ప్రశ్నించే అధికారం లేదు. నోటుకు ఓటు అమ్ముకొనే జనానికి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేదు. ముందు ప్రజలు నిజాయతీగా ఉంటే తప్ప పాలనలో, ప్రభుత్వంలో మార్పురాదు. అదే మా 'ప్రతినిధి' ఇచ్చే సందేశం అంటున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'ప్రతినిధి'. శుభ్రా అయ్యప్ప హీరోయిన్. ప్రశాంత్ మండవ దర్శకుడు. జె.సాంబశివరావు నిర్మాత. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమాజ పరిస్థితుల్ని ప్రతిబింబించే చిత్రమిది. ఓ సామన్య పౌరుడు తలచుకొంటే ఏం చేయగలడో చూపిస్తున్నాం. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తు తెచ్చే చిత్రమిది. నారా రోహిత్ నటన, ఆయన సంభాషణలు ఆకట్టుకొంటాయ''ని చెప్పారు.
ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంద''న్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.
ఇక '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహిత్ ట్రైలర్స్ లో అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి . సంగీతం: సాయికార్తీక్.


Click it and Unblock the Notifications











