twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారి అల్లు అర్జున్ కి ముగ్గురు హీరోయిన్స్

    By Srikanya
    |

    Three heroines in Allu Arjun's film
    హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్‌ ...అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు. అందులో ఒకరు సమంత ఎంపిక అయ్యారని తెలుస్తోంది. మిగతా ఇద్దరి ఎంపిక జరుగుతోంది. ఆ మధ్య కొత్త ఆఫీసులో ఈ చిత్రానికి చెందిన పూజ జరిగినట్లు సమాచారం. అక్టోబర్ లో చిత్రం పూర్తి చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ ఫైనల్ చేసి మిగతా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పడ్డారు. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. కథ ఇప్పటికే సిద్ధమైందట.

    మరో ప్రక్క అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. 'రేసు గుర్రం' చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

    English summary
    
 Trivikram's next film staring Allu Arjun will be romancing not one but three women. Samantha is being considered for the main lead. Search is on for the other two women. Radha Krishna of Julayi fame will produced the film and Devi Sri Prasad will compose the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X