మహేశ్ బాబు స్టోరీతో వెబ్ సిరీస్: డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా

'మున్నా' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ.. దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టింది. అందుకే ఆయనతో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 'బృందావనం' అనే సినిమా చేశాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో వంశీ పైడిపల్లి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌తో 'ఎవడు', నాగార్జున - కార్తీ కాంబినేషన్‌లో 'ఊపిరి' తెరకెక్కించాడు. ఇక, ఇటీవల మహేశ్ బాబు 'మహర్షి' తీసి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

'మహర్షి' తర్వాత వంశీ పైడిపల్లితో మరోసారి సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు మహేశ్ బాబు. ఇందుకోసం ఓ గ్యాంగ్‌స్టర్ నేపథ్యం ఉన్న కథను కూడా రెడీ చేశాడాయన. కొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందనుకున్న సమయంలో దీని నుంచి తప్పుకున్నాడు సూపర్ స్టార్. అంతేకాదు, పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఆ సమయంలో వంశీ పైడిపల్లి పలువురు హీరోలను సంప్రదించినా వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాలతో లాభం లేదనుకున్నాడో ఏమో.. వెబ్ సిరీస్ తీయడానికి ముందుకొచ్చాడు.

Vamshi Paidipally to do Web Series with Mahesh Babu Story

బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన 'ఆహా' కోసం వంశీ పైడిపల్లి ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. తాజాగా దీనికి గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సిరీస్‌ను మాఫియా బ్యాగ్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు, మహేశ్ బాబుకు చెప్పిన కథలో కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందిస్తున్నాడని అంటున్నారు. దీంతో ఆ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X