Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వీరూ పోట్ల దర్శకత్వంలో హిందీ రీమేక్
తన తండ్రి మోహన్ బాబుతో శ్రీవాస్ దర్శకత్వంలో సొంత బేనర్పై సినిమా చేస్తున్న నటుడు మంచు విష్ణ ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వెల్కమ్ ' చిత్రానికి రీమేక్గా రూపొందుతోందని తెలుస్తోంది.
'వెల్ కమ్' చిత్రంలో అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ నటించారు. దీనికి రీమేక్ గా తెలుగులో రూపొందబోయే చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్రలో నాగ చైతన్య, అనిల్ కపూర్ పాత్రలో మోహన్ బాబు, మరో ముఖ్య పాత్రలో శ్రీహరి నటించనున్నారని తెలుస్తోంది. పలు టీవీ చానళ్లు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమాను తెలుగుకు తగ్గట్టుగా తీర్చి దిద్దే పనిని రచయితలు కోనవెంకట్, బీవీఎస్ రవి, గోపి మోహన్ లు స్వీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రచయితల జంట దేనికైనా రెడీ చిత్రంతో మంచి పామ్ లో ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం 'ఆటో నగర్ సూర్య' చిత్రంతోపాటు.... సునీల్తో కలిసి వెట్టై చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా నాగచైతన్య మోహన్ బాబుతో సినిమాకు కమిట్ కావడం గమనార్హం. ఈ మధ్య వరుస ప్లాపులతో డీలా పడ్డ చైతూ...ఈ మల్టీస్టారర్ మూవీలతోనైనా తన రాత మార్చుకుంటాడో చూడాలి.