Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వెంకటేష్ చంద్రముఖి సీక్వెల్ కి స్ట్రైయిట్ టైటిల్?
వెంకటేష్ హీరోగా దర్శకుడు పి.వాసు రూపొందించనున్న 'ఆప్తరక్షక' రీమేక్ చిత్రానికి నాగమల్లి అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించటానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగమల్లి టైటిల్ చంద్రముఖి కన్నడ వెర్షన్(సౌందర్య నటించిన) టైటిల్. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ కి దీనిని పెట్టడంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రంలో మొత్తం 6 నాయికలను ఎంపిక చేస్తున్నారు. వారిలో ప్రథమంగా నలుగురిని సెలక్ట్ చేసినట్లు తెలిసింది. వారు అనుష్క, కమలినీ ముఖర్జి, శ్రద్ధాదాస్, రిచా గంగోపాధ్యాయలు.
వెంకటేష్ సరసన అనుష్క ఇంతకుముందే నటించి ఉన్నారు. మిగతా నాయికలు ముగ్గురు కూడా వెంకటేష్...దీనిని నటిస్తుండటం ఇదే ప్రథమం అవుతుంది. ఈ చిత్రంలో ప్రతి అమ్మాయి కేరక్టర్ విభిన్నంగా వుంటుందని సమాచారం. మరో ఇద్దరు భామలు ఎవరన్నది ఇంకా నిర్ణయం జరగలేదు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించి ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్నట్లు సమాచారం.
'చంద్రము' సీక్వెల్గా వస్తున్నందున సహజంగానే ఈ చిత్రం మీద అధిక అంచనాలుంటాయని, ఆ అంచనాలను అందుకోవాలంటే తన కేరక్టరు మీద మాత్రమే కాకుండా మొత్తం కథనం మీద ప్రత్యేక శ్రద్థ తీసుకోవలసిన అవసరం వుందని వెంకటేష్ భావిస్తున్నారు. ఆరు భామలు కూడా కథలో భాగం పంచుకుంటున్నందున మరింత కలర్ఫుల్గా ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుంది. శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం సమకూరుస్తున్న ఈ చిత్రానికి చిన్నా ఆర్ట్ డైరెక్టరుగా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఈ నెలలో ఈ చిత్రం ముహూర్తం జరుపుకుని, వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఏప్రియల్ నెలాఖరున ఈ చిత్రం లాంఛనంగా మొదలవుతుంది.