'మనసంతా నువ్వే' దర్శకుడు తో అల్లరి నరేష్ చిత్రం
మనసంతా నువ్వే దర్శకుడు వియన్ ఆదిత్య త్వరలో అల్లరి నరేష్ ని డైరక్ట్ చేయనున్నారు. అహనా పెళ్ళంట చిత్రం సీక్వెల్ గా ఈ చిత్రం రానున్నదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డా.డి.రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇక వియన్ ఆదిత్య ప్రస్తుతం రాజ్ అనే చిత్రం రూపొందించి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సుమంత్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ప్రియమణి, విమలారామన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక ఇప్పటికే అహనా పెళ్ళంట టైటిల్ తో అల్లరి నరేష్ ఓ చిత్రం రూపొందించి త్వరలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు వీరభధ్రమ్ డైరక్షన్ చేసారు.
More from Filmibeat
అల్లరి నరేష్ వియన్ ఆదిత్య రాజ్ ప్రియమణి అహనా పెళ్ళంట allari naresh vn aditya raj priyamani ahana pellanta


Click it and Unblock the Notifications











