Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఖలేజా' కోర్టుకు వెళ్ళటానకి అసలు కారణం?
మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ విషయమై నాంపల్లి కోర్టులో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అంతా సర్దుమణిగిందన్న గొడవ మళ్లీ ఎందుకు రైజ్ అయ్యిందనటానకి కారణం తెలిసింది. ఖలేజా టైటిల్ ని విజయ భాస్కర రెడ్డి అనే చిన్న నిర్మాత రిజస్టర్ చేసుకుంటే ..మహేష్ బాబు కోసం ఆ టైటిల్ వాడారు. అయితే విజయ భాస్కర రెడ్డి గొడవ చేయటంతో నిర్మాత సి.కళ్యాణ్ తెలివిగా ఆ టైటిల్ కి మహేష్..ఖలేజా అని పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసారు. దాంతో మండిన విజయ భాస్కర రెడ్డి...ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి అల్లు అర్జున్ బద్రీనాధ్ గుర్తు చేసేలా...భాస్కర్ బద్రీనాధ్ టైటిల్ నీ, బాలకృష్ణ పరమ వీర చక్ర గుర్తు చేసేలా..అశోక్ పరమ వీర చక్ర అని టైటిల్స్ చేస్తానంటూ వెళ్ళారు. దానికి ఫిల్మ్ ఛాంబర్ వారు ఈ టైటిల్స్ రిజస్టర్ చేయరాదంటూ అడ్డు పెట్టారు. కారణంగా ఇలాంటి శబ్దం వచ్చే టైటిల్స్ ఆల్రెడీ రిజస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. దాంతో తమకో న్యాయం, మహేష్ బాబుకో న్యాయం చేస్తారా అంటూ విజయ్ భాస్కర్ రెడ్డి కోర్టుకు వెళ్ళారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.