Don't Miss!
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ ఎఫెక్ట్ : 'ఎవడు' రిలీజ్ తేదీ మార్పు?
హైదరాబాద్ : రామ్చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 25 న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల జూలై 31 కి మార్చారు. అయితే ఇప్పుడు దాన్ని ప్రీ ఫోన్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. అంటే జూలై 25నే విడుదల చేస్తారని చెప్తున్నారు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అప్పటికానీ విడుదల తేదీపై క్లారిటీ రాదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది ఆగస్టు మొదటి వారంలో వచ్చేస్తోంది. ఒక వారం కుడా గ్యాప్ లేకుండా వేయటానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరు. అలాగే థియోటర్స్ ప్లాబ్లం కూడా వస్తుంది. దానికి తోడు ఇద్దరూ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే కావటంతో ఫ్యాన్స్ పరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఇద్దరకీ చాలా బాగం కామన్ అభిమానులు ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ క్లాష్ ని తప్పించటానికి రామ్ చరణ్ ముందుగానే విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.
చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్, రాహుల్దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్