Don't Miss!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరో శివాజీ మద్దతుతో 'మనం సైతం' ఉచిత ఆంబులెన్స్.. సేవలు ప్రారంభం!
టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో శివాజీ మరోసారి తన మంచి మనసుతో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉచిత ఆంబులెన్స్ సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ ఫిలింనగర్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో జెండా ఊపి సరికొత్త సేవలను ప్రారంభించారు. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా మనం సైతం సేవా సంస్థ కొనసాగుతోంది.
నటుడిగానే కాకుండా కాదంబరి కిరణ్ తన మంచి తనంతో అందరికి సహకారం అందేలా మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక మనం సైతం సేవా సంస్థకు ఆయన సొంత ఆంబులెన్స్ సేవలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. హీరో శివాజీ సొంతంగా ఒక అంబులెన్స్ ను కూడా అంధించారు. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది.
కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణతో పాటు నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్ అలాగే చదలవాడ శ్రీనివాసరావు, నటి సన వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక అత్యవసరంలో ఉన్న రోగులకు ఈ అంబులెన్స్ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటాయని ఆంబులెన్స్ అందించిన హీరో శివాజీకి హృదయపూర్వక కృతజ్ఞతలని కాదంబరి కిరణ్ మాట్లాడారు.