హీరో శివాజీ మద్దతుతో 'మనం సైతం' ఉచిత ఆంబులెన్స్.. సేవలు ప్రారంభం!
టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో శివాజీ మరోసారి తన మంచి మనసుతో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉచిత ఆంబులెన్స్ సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ ఫిలింనగర్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో జెండా ఊపి సరికొత్త సేవలను ప్రారంభించారు. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా మనం సైతం సేవా సంస్థ కొనసాగుతోంది.
నటుడిగానే కాకుండా కాదంబరి కిరణ్ తన మంచి తనంతో అందరికి సహకారం అందేలా మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక మనం సైతం సేవా సంస్థకు ఆయన సొంత ఆంబులెన్స్ సేవలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. హీరో శివాజీ సొంతంగా ఒక అంబులెన్స్ ను కూడా అంధించారు. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది.

కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణతో పాటు నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్ అలాగే చదలవాడ శ్రీనివాసరావు, నటి సన వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక అత్యవసరంలో ఉన్న రోగులకు ఈ అంబులెన్స్ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటాయని ఆంబులెన్స్ అందించిన హీరో శివాజీకి హృదయపూర్వక కృతజ్ఞతలని కాదంబరి కిరణ్ మాట్లాడారు.


Click it and Unblock the Notifications











