Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుకుమార్ శిష్యుడిని కూడా లైన్ లో పెట్టిన అల్లు అర్జున్..?
కరోనా ప్రభావం తగ్గితే మన హీరోలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడం కాయంగా కనిపిస్తోంది. ఒక సినిమా తరువాత మరొక సినిమాను గ్యాప్ లేకుండా విడుదల చేస్తారని చెప్పవచ్చు. ఇక షూటింగ్స్ మొదలు పెట్టారు అంటే మరో రెండేళ్ల వరకు రెస్ట్ దొరకదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రెండు మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నారు.
నెక్స్ట్ ఎవరు అందుబాటులో ఉంటే వారితో సినిమా చేయాలని హీరోలతో పాటు మరో వైపు దర్శకులు అదే ఆలోచిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే ప్లాన్ తో ఉన్నాడు. అసలైతే బన్నీ పుష్ప అనంతరం కొరటాల శివతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ తొందర పెట్టడం వలన కొరటక శివ మనసు మార్చుకోవడంతో ఆ సినిమా కాస్త వాయిదా పడింది. సినిమా అయితే క్యాన్సిల్ అవ్వలేదు. కానీ పుష్ప అనంతరం ఉంటుందా లేదా అన్నది డౌటే.
ఇక కొరటాలతో పాటి వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఆ దర్శకులతో పాటు అల్లు అర్జున్ ముందుగానే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబును కూడా లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టిన బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం కూడా కథ సెట్ చేస్తున్నాడు. కానీ ఆ కథకు తారక్ ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఆ కాంబో సెట్టవ్వడం అనుమానామే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక వేళ సెట్టవ్వకపోతే ఆ కథ బన్నీ చేతుల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే.